మంగళవారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలతో చెన్నై ఉలిక్కిపడింది. బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం ఎఫెక్ట్ చెన్నైపై పడినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బంగాళాఖాతంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. భూకంపం వల్ల చెన్నైలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే చెన్నై నెటిజెన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. ఉదయం 7.05 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని ట్వీట్స్ ద్వారా తెలిపారు.