విశాఖపట్నం : దక్షిణకోస్తా వైపుగా సముద్రం నుంచి తేమగాలులు, వెస్ట్ట్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. తేమగాలులతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం వరకు పెనుకొండలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రానున్న ఇరవైనాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో పొడివాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో చలి ప్రభావం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.