ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రధాని మోడీ ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు, హామీలను నెరవేర్చి తీరాలని అన్నారు. చంద్రబాబు డిమాండ్లలో న్యాయం ఉందని అన్నారు. ధర్మమనేది అందరికీ ఒకటే అని..వేరువేరుగా ఉండదని చెప్పారు. మోడీ విభజించు పాలించు విధానాన్ని అవలసంబిస్తున్నారని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా తాను కూడా ఇక్కడే కూర్చుంటానని చెప్పారు. వాగ్దానాలను నెరవేర్చకుండా లెక్కలు చెప్పమనడం వింతగా ఉందని అన్నారు. శంకుస్థాపనలు చేస్తే వాగ్దానం నెరవేర్చినట్లేనా అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి నిధులెక్కడిచ్చారని ప్రశ్నించారు.