ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రం నుంచి తరలి వెళ్లిన పెట్టుబడులను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 02:43 PM

మంగళగిరి పరిధిలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌‌ను మంత్రి నారా లోకేశ్ ఇవాళ (శుక్రవారం) ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో పక్క రాష్ట్రాలతో ఏపీ పోటీ పడాలని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని, పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామన్న వారందరినీ తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన చెప్పారు. టీసీఎస్, లులూ, రిలయన్స్ వంటి కంపెనీలు ప్రస్తుతం ఏపీ వైపు చూస్తున్నాయని ఆయన అన్నారు. దానికి కారణం మన బ్రాండ్ అంబాసిడర్, ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు అని లోకేశ్ పేర్కొన్నారు. ఎక్కడి వెళ్లినా చంద్రబాబు నాయుడి రాష్ట్రం అంటున్నారని, ఆయనపై ఉన్న విశ్వసనీయత, నమ్మకం వల్లే రాష్ట్రంలోకి తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ కనిపించే కియా కార్లు ‘మేడిన్ ఆంధ్రప్రదేశ్’ కావడం గర్వించదగ్గ విషయమని లోకేశ్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com