ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పనిచేస్తేనే జగన్ తిరుమలకు వెళ్లాలి.. బీజేపీ ఎంపీ రఘునందన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 06:57 PM

గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఇవాళ ఆయన తిరుపతి వెళ్లాల్సి ఉండగా.. డిక్లరేషన్ వివాదం, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో ధార్మిక సంఘాల ఆందోళనలు, పోలీసుల ఆంక్షలతో ఆయన తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన తనను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని.. అలాంటప్పుడు సామాన్యులు ఎలా వెళ్తారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.


అన్యమతస్తులు ఎవరైనా తిరుమలకు వెళ్తే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. ఇది బీజేపీ పెట్టిందో, చంద్రబాబు పెట్టిందో, పవన్ కళ్యాణ్ పెట్టిందో కాదని.. అది సంప్రదాయమని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లడంలో, శ్రీవారిని దర్శించుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్న రఘునందన్ రావు.. కానీ డిక్లరేషన్ మాత్రం తప్పక ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ డిక్లరేషన్ అనేది ఒక్క తిరుమలకు మాత్రమే పరిమితం అయింది కాదని.. ఇతర ఆలయాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com