ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలను దుర్వినియోగం చేసేలా భారత్ వ్యవహరిస్తోంది: ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 02:59 PM

అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలను దుర్వినియోగం చేసేలా భారత్ వ్యవహరిస్తోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓ ప్రచార సభలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ భారత్- అతి పెద్ద దుర్వినియోగదారు అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆరోపణలు చేస్తూనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ 'అద్భుతమైన వ్యక్తి' అని అన్నారు. వచ్చే వారం ఆయనను కలుస్తానని చెప్పారు. సెప్టెంబర్ 21-23 మధ్య ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com