ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్ vs చైనా హాకీ ఫైనల్ మ్యాచ్...

sports |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 12:25 PM

భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది. సెమీస్‌లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది. కాగా, మరోవైపు చైనా పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు టికెట్ దక్కించుకుంది. నిర్ణీత సమయం తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. షూటాఫ్‌లో పాకిస్థాన్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. గ్రూప్ రౌండ్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కాగా, చైనా 6 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలను చవిచూసింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాను ఓడించింది. భారత్ వర్సెస్ చైనా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న చైనాలోని హులున్‌బుయిర్‌లో జరగనుంది. పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, చైనాలు మధ్యాహ్నం 1:15 గంటలకు (IST) తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సోనీ స్పోర్ట్స్ టెన్ 1, టెన్ 1 HD ఛానెల్‌ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది . ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ SonyLIV యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com