భారత అంతరీక్ష పరిశోధనా సంస్ధ మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఈ రోజు తెల్లవారు జామున 2.30 గంటలు నిప్పులు చిమ్ముతూ జీశాట్-31 ఉపగ్రమం నింగిలోకి దూసుకెళ్ళింది. 2535 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి ఏరియన్ 5 రాకెట్ లాంచర్ మోసుకెళ్ళింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరీక్ష్ కేంద్రం నుంచి ఈ తెల్లవారు జామున 2.30 గంటలకు ప్రయోగించిన జీశాట్ 31 ప్రయోగం జరిగింది. సమాచార రంగంలో సేవలు అందించే ఈ శాటిలైట్ 15 సంవత్సరాల పాటు పనిచేయనుంది. జీశాట్ 31తో పాటే సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ 4 ఉపగ్రహాన్ని కూడా అంతరీక్షంలో ప్రవేశపెట్టారు. జీశాట్ 31 అత్యంత సమర్ధవంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్ధను కలిగి ఉంది. భారత భూమి, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళా ఖాతం పరిసరాల సమాచారాన్ని జీశాట్ 31 అందించనుంది. ఇదే సమయంలో వీశాట్ నెట్ వర్క్స్, టెలివిజన్ అప్ లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్, సెల్యులార్ బ్యాకప్ తదితరాలకు అనుకూలమైన సాంకేతికత ఇందులో ఉందని ఇస్రో తెలిపింది.