సేవ్ ఇండియా పేరుతో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్దిసేపటి క్రితమే దీక్షను విరమించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మమతాతో దీక్షను విరమింపజేయగా అనంతరం మాట్లాడిన మమతా ప్రధాని మోడీని గద్దెదించి గుజరాత్ పంపిస్తామన్నారు. నిన్న నుండి జరుగుతున్న ఈ పరిణామాలలో సుప్రీంకోర్టు అనుకూలమైన తీపునిచ్చిందన్న మమతా కోల్ కతా పోలీసులను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈకేసుపై ఢిల్లీలో పోరాడతామన్న మమతా ఈ దీక్షలో పోలీసులు కూర్చోలేదని.. అసలు పోలీసులే దీక్ష వేదిక మీదకు రాలేదని.. పోలీసులు ఎలా దీక్ష చేస్తారని హోంశాఖ నోటీసులిస్తుందన్నారు.