బెంగాల్ పోలీసుల వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారించింది. పోలీస్ కమిషనర్ విచారణకు హజరైతే తప్పేంటని సీజేఐ రంజన్ గోగోయ్ ప్రశ్నించారు. కోల్కతా సీపీ విచారణకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు శారదా స్కాంలో సిట్ సరిగా దర్యాప్తు చేయలేదని ఏజీ వాదించారు. సీబీఐ సమర్పించిన సిట్ నివేదిక తప్పుల తడకగా ఉందని ఏజీ ఆరోపించారు.