ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2024, 01:50 PM

భారీ వర్షాలతో  గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్థాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి  వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ హెచ్చరించారు. అటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.3 అడుగులకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com