విశాఖపట్నం: భీమిలి సాగరతీరం భక్తులతో కిటకిటలాడుతోంది. మూడేళ్ల తర్వాత మహోదయ పుణ్యగడియాలు రావడంతో భీమిలి సాగర తీరానికి భక్తులు పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు సాగర తీరంలోని గొస్తనీ సాగర సంగమం వద్ద మహోదయ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పుణ్యగడియలు ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.భక్తుల కోసం అధికారులు ప్రత్యేక స్నాన ఘాట్లు, స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు.