ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్ళు ధ్వంసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 01:44 PM

విజయవాడలో  కుండపోతగా వర్షాలుకురుస్తున్నాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండవచ్చని సహాయ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రొక్లెయిన్ సాయంతో కొండ రాళ్లను పోలీసులు తొలగిస్తున్నారు. మరోవైపు.. సహాయక చర్యలను దగ్గరుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీ రాజశేఖర్ బాబు పర్య వేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com