ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో రిపేరు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 03:25 PM

శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని నెలలుగా మూల పడిన జనరేటర్,ఆర్వో ప్లాంట్ పనిచేయలేదని కరెంటు కోతలతో పేషెంట్లు,ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శింగనమల డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తమ సొంత నిధులతో శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్,ఆర్.ఓ ప్లాంట్ ను రిపేరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రిపేరు చేయించినందుకు పేషెంట్లు,ప్రజలు ఆసుపత్రి సిబ్బంది,టిడిపి నాయకులు కార్యకర్తలు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com