రాయదుర్గంలోని మధు సినిమా థియేటర్ వద్ద ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దుగ్గిలమ్మ దేవి ఆలయ జాతరను సెప్టెంబర్ 3న నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు బి. సవిత, వత్సల అశ్వత్ తెలిపారు. జాతరను ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మంగళవారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకొని జాతరను జయప్రదం చేయాలని ధర్మకర్తలు పిలుపునిచ్చారు.