ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:48 PM

గుంతకల్లు మండలంలోని ములకలపెంటలో నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అందజేసిన రూ.3 లక్షల విరాళంతో ములకలపెంటలో గ్రామస్థులు వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వేటగాడిగా ఉన్న వాల్మీకి రామాయణాన్ని రచించి మహర్షిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ కృష్ణారెడ్డి, నాయకులు తలారి మస్తానప్ప, గుమ్మనూరు నారాయణ, రామన్న చౌదరి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com