ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామసభలో వివాదం, వైసీపీ నేతలపై కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:43 PM

విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని చింతలపాలెం గ్రామ సర్పంచ్‌ మాకెన సీతారామపాత్రుడు(నవీన్‌)పై శుక్రవారం సాయంత్రం గ్రామసభలో జరిగిన దాడికి సంబంధించి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, వైసీపీ నాయకుడు కాయితపు బీష్మతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం చింతలపాలెంలో జరిగిన గ్రామసభ ముగిసిన తరువాత తనకు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని మాజీ సర్పంచ్‌ కోరగా అందుకు సమస్యలు ఏమైనా ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఎమ్మెల్యే లలిత కుమారి సూచించారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్‌ సీతారామపాత్రడు సర్ది చెబుతుండగా ఒక్కసారిగా వైసీపీ నాయకులు దాడి చేయడంతో చేయివిరిగింది. ఇందుకు సంబంధించి సర్పంచ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీసర్పంచ్‌తో పాటు మరో ఇరువురిపైకేసు నమోదు చేశారు. ఈ ఘటన తరువాత గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని సీఐ తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. దాడి చేసిన వారికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com