ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్లెలకు మేలు జరిగితే అంత అసహనం ఎందుకు జగన్‌?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 06:47 PM

పల్లెలకు మేలు చేస్తుంటే జగన్‌ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయేలా గ్రామసభలు జరిగాయని తెలిపారు. పంచాయతీలకు కొద్దిరోజుల ముందే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారని అన్నారు. రూ.4,500 కోట్ల ఉపాధిహామీ పనులకు ఒకేసారి ఆమోదం తెలపడం చారిత్రాత్మకమని అన్నారు. త్వరలో రూ.1,100 కోట్లు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతున్నా జగన్ సొంత మీడియాలో పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పల్లెలకు నిధులు, అభివృద్ధి పనుల పండగ వస్తే సంతోషించాల్సిందిపోయి నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల నిధులు రూ.13వేల కోట్లు ఏం చేశారో జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో పంచాయతీలకు ఏం చేశారో చెప్పాలని జీవీ ఆంజనేయులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com