ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్ధాలు చెప్పడంలో జగన్ సిద్ధహస్తుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 06:37 PM

అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. ‘‘జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడు’’ అంటూ మండిపడ్డారు. ఎల్జి పాలిమర్స్ ఘటం జరిగినప్పుడు బాగా తీవ్రంగా గాయపడిన వారికి 20,000, పాక్షికంగా గాయపడిన వారికి 10000 ఇవ్వమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు పరిహారం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పాలిమర్స్ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదన్నారు. ఎసెన్షియ ప్రమాద ఘటన లో మృతి చెందిన 17 మంది మృతులకు, 36 మందికి క్షతగాత్రులకు ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు పంపడం జరిగిందన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తెలిసి తెలియకుండా శవాలు మీద పేరాలు ఏరుకున్నట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రమాద బాధితులకు న్యాయం చేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com