ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనపై వ్యతిరేక వార్త రాస్తే తాట తిస్తానంటూ రిపోర్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 03:04 PM

శ్రీకాళహస్తి - మునగలపాళెం ప్రాంతంలో కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ.500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వార్త రాసిన రిపోర్టర్‌కు టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు.నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా.. ఏమనుకుంటున్నావ్.. ఇదే నీకు చివరి హెచ్చరిక.. వైసీపీ పాలనలో కనబడలేదా? ఇప్పుడే అన్ని గుర్తుకొచ్చాయా.. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో. ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు. నీ కథ ముగిసినట్లే అంటూ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com