కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోను, దుర్గాపూర్లోనూ త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మోడీ సభలు జరిగే రెండు ప్రాంతాలు రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నవే. కాగా ఈ సందర్భంగా పౌరసత్వం (సవరణ) బిల్లుపై మోడీ మాట్లాడుతారని రాష్ట్ర బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.