ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహసీల్దార్‌ హత్యకేసులో నిందితుడి బెయిల్‌ రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 03:34 PM

విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ హత్యకేసులో నిందితుడు ఎం.సుబ్రహ్మణ్యరంగారావు బెయిల్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ మంగళవారం రద్దుచేశారు. జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కాండ్రేగుల జగదీశ్వరరావు తెలిపిన వివరాలివి. తహసీల్దార్‌ సనపల రమణయ్య హత్యకేసులో నిందితుడు ఎం.సుబ్రహ్మణ్యరంగారావుకు భీమునిపట్నం 16వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈఏడాది మే 14న బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని పీఎంపాలెం పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. నిందితుడి కాల్‌డేటా ఆధారంగా వివరాలు సమర్పించి బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితుడి బెయిల్‌ను రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com