ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 03:31 PM

కర్నూలు జిల్లా, జలకనూరు మద్దిగుండం చెరువు నీటి సమస్యపై శాంతియుతంగా పరిస్కరించుకోవడానికి ఇరు గ్రామాల రైతులు సహరించాలని ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ అన్నారు. మంగళవారం సుంకేసుల, జలకనూరు గ్రామాల రైతులతో సమావేశం ఎస్‌ఐ జగన్‌మోహన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి ఆత్మకూరు డీఎస్పీ రామాంజనాయక్‌, నందికొట్కూరు రూరల్‌ సీఐ బీఆర్‌ కృష్ణయ్య హాజరయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ మద్దిగుండం చెరువు నీటి విషయంపై రైతులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. ఇరుగ్రామాల రైతులకు మధ్యవర్తులుగా పోలీసువారు అధికారులు, నాయకులతో మాట్లాడి సమస్యను పరిస్కరించుకుందామని రైతులకు సూచిం చారు. అలా కాకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి గొడవలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామి ఆయన హెచ్చరించారు. సమావేశంలో సుంకేసుల, జలకనూరు గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com