ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖ జిల్లా నేతలతో సమావేశంకానున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 01:27 PM

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ఇతరులను కలిసేందుకు అవకాశం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.ఇప్పటికే 5 నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమావేశం అయిన  వైయస్‌ జగన్, మిగిలిన నియోజకవర్గాల నాయకులతో మంగళవారం, బుధవారం భేటీ అవుతారు. ఈ కారణం వల్ల ఇతర నాయకులు, సందర్శకులను ఆయన కలిసే అవకాశం ఉండదని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com