ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 08:23 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు.


దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే సిఫార్సు లేఖల్ని టీటీడీ ఆమోదించాలని చంద్రబాబును కోరినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ వినతిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చే సిఫార్సు లేఖల్ని టీటీడీ స్వీకరించడం లేదు. ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించాలని కోరుతున్నారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.


మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.. అక్కడి నుంచి అమరావతిలోని సచివాలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు ఆర్టీసీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో పాటు వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. చంద్రబాబు ఏపీతో పాటుగా తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.. ఇకపై తెలంగాణకు కూడా సమయం కేటాయిస్తానన్నారు. అలాగే త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమించాలని భావిస్తున్నారు.. ఇటీవల జరిగిన పోలిట్‌బ్యూరో సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. తెలంగాణ టీడీపీ నేతల అభిప్రాయాలను తీసుకుని.. అతి త్వరలోనే తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com