ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 01:52 PM

తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గదులు, ఆవరణంలోని పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com