భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ సెలెక్ట్ కమిటీ కి నివేదిక అందచేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందుత్వం అజెండాతో అల్లర్లు జరిగే ప్రమాదముందని పేరర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా 2019 లో కదిపేయనున్న పలు అంశాలపై అమెరికా ఇంటెలిజెన్స్ తన నివేదికలో ప్రస్తావించింది. భారత దేశంలో మతపరంగా ఒకింత ఉద్రిక్త పరిస్థితి ఉందంటూ అమెరికా నిఘా వర్గాలు పేర్కొనడం కలకలం రేపుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ హిందూత్వ భావజాలం వైపు బీజేపీ కదులుతుందని, ఫలితంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని తెలియచేసింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా తలెత్తే సమస్యలపై అమెరికా నిఘా బృందాలు భారతదేశంతో పాటు పలు దేశాల్లో ఇటీవల పర్యటించాయి. ఏ దేశ పరిస్థితులను ఆ దేశంలోనే క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే నివేదిను రూపొందించాయి. ఈ నివేదికను సీఐఏ డైరెక్టర్, ఎఫ్బీఐ డైరెక్టర్ రూపొందించారు.