ముస్లింల ఆధిక్యం గల పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రం ఖ్వాంబర్-షాహ్దాద్కోట్కు చెందిన సుమన్ కుమారి ఆమె తన సొంత జిల్లా కోర్టు న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. సుమన్ కుమారి తన ఎల్ఎల్బీ కోర్సును హైదరాబాద్లో పూర్తిచేశారు.తర్వాత కరాచీలోని సాబిస్త్ విశ్వవిద్యాలయంలో పీజీ పట్టా అందుకున్నారు. పేదలకు న్యాయ సాయం కోసమే న్యాయ వ్యవస్థలోకి వచ్చానని తెలిపారు.తాను ఈ స్థాయికి రావడానికి తన తండ్రి డాక్టర్ పవన్ కుమార్ బోడన్తోపాటు ఇతర కుటుంబ సభ్యుల మద్దతు ఇతోధికంగా ఉన్నదన్నారు.ఆమె తండ్రి పవన్కుమార్ స్పందిస్తూ పేదలు, ప్రత్యేకించి హిందువులకు అవసరమైన న్యాయ సాయం అందించేందుకు వీలుగా ఆమెకు స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. ఆమె పెద్దక్క సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, మరో సోదరి చార్టర్డ్ అక్కౌంటెంట్. హిందువు న్యాయమూర్తిగా నియమితులు కావడం ఇదే మొదటిసారేం కాదు. 2005-07 మధ్య జస్టిస్ రాణా భగవాన్దాస్.. పాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పని చేశారు. ఇక సుమన్ కుమారికి భారత గాయకులు లతా మంగేశ్వరి, అతిఫ్ అస్లాం అంటే ఎంతో ఇష్టం.