ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఒక హిందూ మహిళ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. ఖాంబర్-షాదాద్కోట్కు చెందిన సుమన్ కుమారి తొలిసారిగా జస్టిస్ రాణా భగవాన్దాస్ జడ్జిగా నియమితులయ్యారు. తన సొంత జిల్లాలోనే ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. హైదరాబాద్లో ఎల్ఎల్బి పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని స్జేబిస్ట్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు మీడియా పేర్కొంది.