ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం

international |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 09:55 AM

సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్‌తో మత హింస జరిగే అవకాశం ఉందని అమెరికా నిఘా విభాగం ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డైరెక్టర్ డాన్ కోట్స్ హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హిందూ జాతీయవాద సిద్ధాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తే ఈ ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు. ఆయన గూఢచర్యంపై ఏర్పడిన సెనేట్ సెలెక్ట్ కమిటీ ఎదుట మంగళవారం వాదనలు వినిపించారు. 


నరేంద్ర మోదీ హయాంలో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత ఉద్రిక్తతలు పెరిగాయని డాన్ కోట్స్ తెలిపారు. తమ మద్దతుదారులను యాక్టివ్ చేసేందుకు తక్కువ స్థాయిలో హింసను ప్రేరేపించేందుకు హిందూ జాతీయవాదాన్ని బీజేపీ నేతలు సాధనంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. మత ఘర్షణలు పెరిగితే ఇస్లామిస్ట్ ఉగ్రవాద ముఠాల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల పాక్-భారత్ సంబంధాలు మరింత ఉద్రికత్తంగా మారే అవకాశం ఉందన్నారు. 


ఇదే జరిగితే పాక్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు భారత్‌తో పాటు ఆఫ్గానిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. భారత్, పాక్ అణ్వాయుధ కార్యక్రమాలు పెంచినందున ఈ దాడులు దక్షిణాసియాలో అణు భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని డాన్ కోట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com