న్యూఢిల్లీ : మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి అయిన మనోహర్ పారికర్కు రాఫెల్ కుంభకోణంలో నూతన ఒప్పందంతో ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వెల్లడించారు. అనీల్ అంబానీకి లాభం చేకూర్చేందుకు ప్రధాని మోడీ చేపట్టిన రాఫెల్ ఒప్పందంలో పారికర్ పాత్ర లేదని కొచ్చిలో నిర్వహించిన బూత్-స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో రాహుల్ అన్నారు. కాగా, పనాంజిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పారికర్తో మంగళవారం రాహుల్ సమావేశమైన సంగతి తెలిసిందే.