ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీచ్‌తో అదరగొట్టిన రెడ్డెప్పగారి మాధవి.. వెనక్కి తిరిగి మరీ పవన్ కళ్యాణ్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 08:18 PM

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ప్రసంగానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా చూస్తూ ఉండిపోయారు. మద్యం పాలసీపై బుధవారం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. అనంతరం అసెంబ్లీలోని సభ్యులు దీనిపై ప్రసంగించారు. ఈ క్రమంలోనే కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురైన అనుభవాలను, వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం పాలసీ వలన కలిగిన దుష్ర్పభావాలను కడప రెడ్డెమ్మ వివరించారు. అయితే ఆమె కథ రూపంలో తన ప్రసంగాన్ని కొనసాగించడంతో.. పవన్ కళ్యాణ్ సీట్లో నుంచి వెనక్కి తిరిగి కూర్చుని మరీ మాధవిరెడ్డి ప్రసంగాన్ని ఆలకించారు.


మేము ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో రాత్రి 11 గంటలకే మగవారు వింతగా ప్రవర్తిస్తూ అడ్డుగా వచ్చేవారు. మేమంతా తమషాగా ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చారని అనుకునేవాళ్లం. అలాగే ఓ మహిళను కలిశాను. తెలుగుదేశం పార్టీకి ఓటేయమని కోరాను. ఆమె వెంటనే తెలుగుదేశానికి కాకపోతే ఇంక దేనికేస్తామని బదులిచ్చింది. అంత కచ్చితంగా ఎళా చెప్తున్నావని అడిగా. వాలంటీర్ వచ్చి వైసీపీకి ఓటేయాలని చెప్పినట్లు నాతో చెప్పింది. నేను వేయను అంటే.. లక్షా ఐదువేలు డబ్బులిచ్చాం.. ఓటెందుకు వేయవని అన్నారంట.. దాంతో ఈమె మా ఆయన రోజూ మూడొందల రూపాయలు మందు తాగుతున్నాడు. ఆ లెక్కన నెలకు 9 వేలు.. ఏడాదికి లక్ష రూపాయలు అవుతుంది. ఐదేళ్లకు ఐదు లక్షలు కడుతున్నాం.. మీ లక్షా ఐదు వేలు తీసేస్తే మిగతా 4 లక్షల 95 వేలు మీరే నాకు వెనక్కి ఇవ్వాలని చెప్పిందంట అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని కడప ఎమ్మెల్యే మాధవి పంచుకున్నారు.


మరోవైపు కడప రెడ్డెమ్మ ఈ విషయం చెప్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తిగా గమనించారు. ఆమె చెప్తున్న విషయాలను కుర్చీలో వెనక్కి కూర్చుని మరీ వింటూ కనిపించారు. వైసీపీ అనుసరించిన మద్యం విధానాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించామన్న మాధవిరెడ్డి.. మద్యానికి బానిసలుగా మారిపోయారన్నారు. సాయంత్రం ఆరు నుంచే యువత గంజాయి తాగుతూ కనిపించేవారన్న కడప ఎమ్మెల్యే.. కడపలో గంజాయిపై నిఘా వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. మద్యానికి, గంజాయికి బానిసలుగా మారిన వారి కోసం రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com