ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 01:06 PM

వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది అని మాజీ మంత్రి సి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అయన మాట్లాడుతూ.... అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్‌ ఆర్డర్‌ కనిపిస్తో్తంది. వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com