ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 05:19 PM

శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  తెలుగువారందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి  ట్వీట్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com