ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్నారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 08:11 PM

నంద్యాల జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు తరలివస్తుంటారు. బస్సులు, కార్లు, బైక్‌లు ఇలా వాహనాలతో పాటుగా నల్లమల అటవీ ప్రాంతం నుంచి కూడా కొందరు భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ నుంచి భక్తులు నడకమార్గంలో శ్రీశైలం వస్తుంటారు. అయితే నల్లమల అటవీ ప్రాంతం నుంచి నడిచే వచ్చే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. అటవీ ప్రాంతంలో నుంచి శ్రీశైలం వెళ్లడంపై అధికారులు నిషేధం అమలు కానుంది.


 జులై నుంచి సెప్టెంబర్ వరకు పులుల ఏకాంత సమయం.. ఇది సంతానోత్పత్తి సమయం కావడంతో ఎన్టీసీఏ ఆదేశాల మేరకు ఆగష్టు నుంచి నల్లమల అడవుల్లోకి ప్రజలను అనుమతించరు. పూర్గాతి నిషేధం అమల్లోకి వస్తుంది.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అటవీ ప్రాంతంలో జన సంచారం కారణంగా పులల ఏకాంతానికి భంగం ఏర్పడుతుందని.. వాటి సంతానోత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఇలా నిషేధం విధిస్తారు. ఒక్క నల్లమల అటవీ ప్రాంతం మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల్లో మూడు నెలలపాటు జన సంచారాన్ని నిషేధిస్తారు.


ఎన్టీసీఏ ఆదేశాల మేరకు పులుల పునరుత్పత్తి సమయం కావడంతో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శన, సఫారీలను అధికారులు నిలిపివేస్తారు. నల్లమలలో ప్రస్తుతం జన సంచారంపై ఆంక్షలు పెట్టినా ఇతర కార్యకలాపాలను ఆగస్టు నెల ఒకటి నుంచి పూర్తిగా నిషేధిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నల్లమల అడవి విస్తరించింది ఉంది. నాగార్జునసాగర్‌-శ్రీశైలం పులుల అభయారణ్యం ఉంది.. అయితే నల్లమలలో 80 పులులు ఉన్నట్లు గుర్తించారు. జులై నుంచి సెప్టెంబరు నెల మధ్య పెద్ద పులులు సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. అందుకే అవి ప్రశాంత వాతావరణంతో పాటు ఏకాంతాన్ని కోరుకుంటాయి.. నీటి వనరులున్న ప్రాంతానికి వెళ్లి మరీ సేదతీరుతాయి. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా బెదిరిపోతాయని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు.


అటవీప్రాంతంలో ఆడ, మగ పులుల ఏకాంతానికి కొన్ని రోజులు మాత్రమే అనుకూలం అంటున్నారు. ఆడ పులల గర్భధారణ సమయం 16 వారాలు వరకు ఉంటుందని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.. పులి సంతానోత్పత్తి కాలం 93 నుంచి 112 రోజుల వరకు ఉంటుంది. పులి పిల్లలు పెద్దవైనా 2 నుంచి 2.5 ఏళ్ల వయసొచ్చే వరకు తల్లి వెంటే ఉంటాయంటున్నారు. అందుకే సెప్టెంబర్ వరకు ఈ నిషేధం కొనసాగుతుంది అంటున్నారు. అందుకే శ్రీశైలం వెళ్లే భక్తులు తమకు సహకరించాలని కోరుతున్నారు. సెప్టెంబర్ వరకు భక్తుల్ని అనుమతించరని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com