ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొలాలలో దొంగలను పట్టుకున్న రైతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 03:31 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలోని పొలాలలో బోర్ల కేబుల్ వైర్, వాటర్ పైపులు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను రైతులు ఆదివారం పట్టుకున్నారు. పొలాలలో ఎవరు లేని సమయంలో గత కొన్ని రోజులుగా దొంగతనం జరుగుతున్నదని రైతులు ఆవేదన చెందుతున్న సమయంలో ఇద్దరు దొంగలు చేతికి దొరకడంతో చితకబాదారు. అనంతరం మార్కాపురం రూరల్ పోలీసులకు దొంగలను అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com