ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:41 PM

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా, వంగర మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, ఎస్‌ఐ జనార్దన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాజులగుమ్మడకు చెందిన రెడి ్డకృష్ణ(46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తమ మొక్కజొన్న పంటకు గడ్డి మందు పిచికారి చేయటానికి బయలుదేరి వెళ్లాడు. కానీ సాయంత్రం వరకూ ఇంటికి తిరిగి రాకపోటంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. పొలంలో వెతుకులాట సాగించారు. ఐనా ఫలితం లేకపోగా ఆదివారం ఉద యం కుటుంబసభ్యులు వెతకగా కొంత దూరంలో ఉన్న చెరుకుతోటలో కృష్ణ పురు గులమందు తాగి పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే భార్య భవానితో పాటు పిల్లలకు సమాచారం అందించారు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై జనార్దన్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com