ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో వృధుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:34 PM

ఒక వృద్ధుడు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహ నంపై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఎగిరిపడి ఎదురుగా వస్తున్న లారీ కిందపడి దుర్మరణం పాలయ్యాడు. ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సాపర్ల హరిచంద్రప్రసాద్‌ (60) ఆదివారం సాయంత్రం గోపాలపురం వచ్చి తిరిగి ఇంటికి బయలు దేరాడు. గోపాలపురం శివార్లలో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో హరిచంద్రప్రసాద్‌ వాహనంతో పాటు ఎగిరి కుడివైపునకు పడడంతో కొయ్యల గూడెం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న లారీ అతని పైనుంచి వెళ్లింది.దీంతో ప్రసాద్‌ అక్కడికక్కడే మృతిచెందాడన్నారు.కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com