ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటి తోటను ధ్వంసం చేసిన ఏనుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:34 PM

విజయనగరం జిల్లా పరిధిలోని మార్కొండపుట్టి నిర్వాసిత గ్రామంలో అరటి తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. మరికొద్ది రోజుల్లో పంట చేతికందుతుందన్న సమయంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటు న్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి ధనుంజయరావు ఆదివారం ఉదయం ఆ ప్రాం తాన్ని పరిశీలించారు. సుమారు 6 ఎకరాల అరటి పంట ను ఏనుగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. పంట నష్టం వివరాలను తహసీల్దార్‌ కార్యాలయం అధికారులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఏనుగుల సంచారం లో గ్రామస్థులు పంట పొలాలకు వెళ్లేందుకు భయప డుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com