ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైనల్‌లో పాకిస్థాన్ చిత్తు.. లెజెండ్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌దే టైటిల్

sports |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2024, 10:01 PM

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ అవతరించింది. బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన ఈ తుది పోరులో భారత జట్టు.. పాకిస్థాన్ ఛాంపియన్స్‌ను చిత్తు చేసింది. దీంతో టైటిల్ సాధఇంచింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం భారత్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


 ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఛాంపియన్స్ కెప్టెన్ యూనిస్ ఖాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కష్టాల్లో పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాకిస్థాన్‌కు పరుగులు రావడం కష్టమైంది. షోయబ్ మలిక్ 36 బంతుల్లో 41 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు తీయగా.. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో మెరుపు బ్యాటింగ్‌తో సత్తాచాటిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సురేశ్ రైనా (4) కూడా నిరాపర్చాడు. ఈ దశలో మరో ఓపెనర్ అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. గుర్‌కీరత్ సింగ్ మాన్ (33 బంతుల్లో 34 రన్స్)తో కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


30 బంతుల్లో 50 పరుగులు చేసిన అనంతరం రాయుడు ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 98. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్ (22 బంతుల్లో 15 రన్స్) వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. దీంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే యూసుఫ్ పఠాన్ 16 బంతుల్లో 30 రన్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే ఫోర్ కొట్టిన ఇర్ఫాన్ పఠాన్.. జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 విజేతా నిలిచింది.


దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన రెండు వారాల్లోనే మరో టైటిల్ దక్కింది. యువరాజ్ సింగ్ నేతృత్వంలోనే ఇండియా ఛాంపియన్స్ సైతం టైటిల్‌ను ముద్దాడింది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్.. భారత్‌తో మ్యాచ్ అనేసరికి మరోసారి ఒత్తిడికి చిత్తు అయింది. లీగ్ దశలో ఆ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com