ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ముంబైకి వెళ్లనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 02:48 PM

రిలయన్స్‌ కంపెనీ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంట వివాహ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అంబానీ కుమారుడు అనంత్‌కు రాధికా మర్చంట్‌తో శుక్రవారం వివాహం జరిగింది. రిసెప్షన్‌ శనివారం రాత్రి ముంబైలో జరుగనుంది. చంద్రబాబు సాయంత్రం అక్కడకు చేరుకుంటారు. రిసెప్షన్‌కు హాజరై ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం మధ్యాహ్నం అమరావతికి తిరిగొస్తారు. ఈ పెళ్లిలో పాల్గొనేందుకు మంత్రి లోకేశ్‌ శుక్రవారమే ముంబై వెళ్లారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా.. చంద్రబాబు ఆయన శనివారం ఉదయం 8.30గంటలకు మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ గ్రామంలోని గోకుల క్షేత్రంలో నిర్మిస్తున్న వెంకటేశ్వర ఆలయం లో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. పార్టీ కార్యకర్తలను, సందర్శకులను కలుస్తారు. పార్టీ నేతలతో భేటీ అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com