ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన కప్ప గుర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 09:22 PM

తిరుపతి, తిరుమల ప్రాంతంలో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన కప్ప కనిపించింది. శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన ‘శ్రీలంకన్‌ స్యూడో ఫిలేటస్‌ రిజియస్‌’గా పిలిచే ఈ కప్పును పరిశోధకులు గుర్తించారు. శేషాచలం అడవుల్లో గోధుమ రంగు చెవి పొద కప్ప ఉన్నట్లు తెలిపారు. తలకోన సమీపంలో ఈ కప్ప సంచారానికి సంబంధించిన వివరాలను, ఆధారాలను శాస్త్రవేత్తలు, జీవవైవిధ్య మండలి పరిశోధకులు వెల్లడించారు.శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో ఈ అరుదైన కన్న కనిపిస్తుంటుంది. శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం ప్రాంతంలో ఈ కప్ప కనిపించినట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ధ్రితి బెనర్జీ తెలియజేశారు. న్యూజిలాండ్‌ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ పేపర్ జూటాక్స్‌లో పరిశోధన వ్యాసం ప్రచురితమైందని తెలిపారు. ఒకప్పుడు భారతదేశం, శ్రీలంక భూభాగాలు కలిసే ఉండేవన్న వాస్తవాన్ని ఈ పరిశోధన నిరూపిస్తోంది అన్నారు పరిశోధకులు.


ఈ అరుదైన కప్ప రాకోఫోరిడే కుటుంబంలోని కప్పల జాతికి చెందినగా చెబుతారు..ఇది శ్రీలంకకు చెందినదిగా చెబుతున్నారు. ఈ కప్పలు ఎక్కువగా తేమతో కూడిన లోతట్టు అడవులు , పర్వత ప్రాంతంలో ఉండే అడవులు , తోటల్లో ఉంటాయి. ఈ కప్ప వెనుక చర్మం ముదురు గోధుమ రంగు పట్టీలు, ఇతర గుర్తులతో బూడిద-గోధుమ రంగులో ఉంటుంది. భుజాలపై పసుపు-ఆకుపచ్చ రంగు, మధ్యలో ఎరుపు-గోధుమ రంగు, రెండు నలుపు చారలు ఉంటాయి. భుజాలు ముదురు గోధుమ రంగు గుర్తులతో పసుపు-బూడిద రంగులో ఉంటాయి. వెనుక కాళ్ల భాగాలు లేత నీలం రంగులో ఉంటాయి. పాదాల అడుగుభాగాలు తెల్లటి గుర్తులతో నల్లగా ఉంటాయి. ఈ కప్ప జాతి రాను, రాను అంతరించిపోతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు, జీవులు, మొక్కలు ఉన్నాయి. తాజాగా ఈ అరుదైన కప్ప జాడను కూడా కనిపెట్టారు. శ్రీలంకలో కనిపించే ఈ కప్పలు.. ఇప్పుడు శేషాచలం అటవీప్రాంతంలో గుర్తించడం ఆసక్తికరంగా మారింది.. వీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారరన్నది కూడా చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com