ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య వలన ప్రాణహాని ఉందని పిర్యాదు చేసిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 02:15 PM

తన భార్య నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ భర్త పోలీసులను ఆశయ్రించాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా, గార మండలం పేర్లవానిపేట గ్రామానికి చెందిన పేర్ల చైతన్యకు తన అక్క కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తిరీత్యా సీమెన్‌ కావడంతో చైతన్య ఎక్కువగా సముద్రంలో ఉంటుంటాడు. అయితే గత రెండేళ్లుగా అతని భార్య అదే గ్రామానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం, భర్త జీతం డబ్బులను విలాసాలకు వినియోగిస్తున్నట్లు గ్రామస్థుల ద్వారా చైతన్య కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీనిపై ఆమెను నిలదీశారు. అయినా పరిస్థితిలో మార్పురాకపోవడంతో చైతన్య కుటుంబ సభ్యులు గార పోలీసులను ఆశ్రయించారు. భర్త ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఉద్యోగం నుంచి వచ్చి చైతన్య మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న భార్య.. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై శ్రీకాకుళం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను చెప్పింది చేయకపోతే చంపుతానని తన భార్య బెదిరిస్తుందని, న్యాయం చేయాలని పోలీసు లకు చైతన్య మొరపెట్టుకున్నాడు. దీంతో గార, వన్‌టౌన్‌లో అందిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com