రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నాడని, చంద్రబాబు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సంప్రదాయం అధికారం మారిన రోజున టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. ఏం పాపం చేశాడని అజయ్కుమార్రెడ్డి అనే కుర్రాడిపై దాడి చేశారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి ఓటు వేశాడని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందినవాడని అతన్ని అతిదారుణంగా గాయపరిచి ఆస్పత్రిపాలు చేశారని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్కుమార్రెడ్డిని వైయస్ జగన్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. అజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.