ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలువలలో పూడికల తీత ప్రారంభించాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 04, 2024, 12:27 PM

చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దు తానని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. గరివిడి మండల పరిషత్‌ కార్యాలయంలో మం డల స్థాయి అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు మండలంలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. తోటపల్లిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. తోటపల్లి కాలువలలో పూడికల తీతకు రూ.20 లక్షలు మంజూరు చేయించామన్నారు. సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. పిచ్చికుక్కలు, పాముకాటుకు అవసర మైన మందులు పీహెచ్‌సీలో నిల్వ ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమస్యలు చెబితే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు స్కూల్‌బ్యాగ్‌ లు, కిట్లు పంపిణీ చే శారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పైల బలరాం, సారిపాక సురేష్‌కుమార్‌, బలగం వెంకటరావు, వెంపడాపు రమణమూర్తి, ఎంపీడీఓ మధు, ఎంఈఓ ిపి.రామారావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com