ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 01, 2024, 05:36 PM

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని... పొద్దు పొద్దున్నే అందించామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ  అన్నారు. సోమవారం ఉదయం పెనుగొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయంలో పెన్షన్ వెయ్యి పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని.. భయం వలన వారు రాలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్‌ను ప్రజలు కక్ష కట్టి ఓడించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com