గుంతకల్లు పట్టణంలోని సీపీఐ సీనియర్ నాయకులు అబ్దుల్ వహాబ్ మృత దేహానికి బుధవారం టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ కూడా వహాబ్ ఇంటికి వెళ్లి పార్టీ జెండాను మృతదేహానికి కప్పి నివాళులు అర్పించారు. వహాబ్ కార్మికులు సమస్యలపై ఎనలేని పోరాటాలు చేశారని జగదీష్ కొనియాడారు. ఆయనతో పాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |