ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్ పరీక్షమరల నిర్వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:26 PM

నీట్ పరీక్షలు  మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష సరిగా నిర్వహించలేని ఎన్‌టిఏను రద్దు చేయాలని నీట్ పరీక్ష పేపర్ లికేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నీట్, యూజీ, పీజీ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com