ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగన్‌వాడీ స్థలం ప్రహరీ ని తొలిగించిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 05:33 PM

అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని  టీడీపీ నాయకులు ఆక్రమించిన ఘటన చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలంలోని బెరబల్లిలో  సోమవారం చోటు చేసుకుంది. పెద్దపంజాణి పంచాయతీ బెరబల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్న సుమారు 10 సెంట్ల ప్రభుత్వ భూమిని దాదాపు రెండేళ్ల క్రితం గ్రామస్తుల వినతి మేరకు రెవెన్యూ అధికా­రులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని  అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయి­స్తూ ఆక్రమ­ణలకు గురికాకుండా ప్రహరీ ఏర్పాటు చేశా­రు. టీడీపీ నాయకులు తమ ప్రభు­త్వం అధికారంలోకి రావడంతో ఆ భూమి­ని తిరిగి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. జేసీబీతో ప్రహరీని తొలగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com