ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఎదుగుదలకి అయన ఎంతో కృషి చేసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 04:14 PM

శాలివాహనుల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని కుమ్మర వీధిలో తాలుకా అధ్యక్షుడు పాండురంగస్వామి ఆధ్వర్యంలో జిల్లా శాలివాహనుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేసిన వారిని అగ్రవర్ణాలు పొట్టనపెట్టుకున్నాయని అన్నారు. తనను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫ్యాక్షన్‌ గొడవల నుంచి రక్షించడం వల్లే ఈ రోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. బడుగు, సామాజిక వర్గాలకు సేవలందించేలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటునందిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నా శాలివాహనుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం తుగ్గలి నాగేంద్రతోపాటు సంఘం దక్షిణ భారతదేశ సంఘం అధ్యక్షులు చౌడప్పశెట్టి, పలువురు నాయకులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com